- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం.. ఇరుదేశాల బంధం పై ప్రశంసలు!
అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం.. యుఎస్ ఎంబసీ ప్రత్యేక నివాళి వేడుకల్లో పాల్గొని భారత్-అమెరికా భాగస్వామ్యాన్ని కొనియాడిన భారత ప్రముఖులు!

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు అమెరికా (United States) 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోంటోంది. ఈ సందర్భంగా భారత దేశంలో యుఎస్ ఎంబసీ (US Embassy) నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో భారతదేశానికి చెందిన ప్రముఖ శబ్దాలు, ప్రముఖులు భాగస్వామ్య మయ్యారు. భారత్-అమెరికాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, స్నేహ బంధాన్ని వేడుకగా జరుపుకుంటూ యుఎస్ ఎంబసీ విడుదల చేసిన ప్రత్యేక నివాళి (Tribute) కార్యక్రమంలో దేశంలోని వివిధ రంగాల ప్రముఖులు తమ స్వరాలను కలిపారు.
అంతకంతకూ బలపడుతున్న అంతర్జాతీయ బంధం
ఈ మైలురాయి వేడుకలలో భాగంగా ఇరుదేశాల మధ్య ఉన్న సాంస్కృతిక, ఆర్థిక, సాంకేతిక బంధాన్ని ప్రముఖులు కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం, అత్యంత పాత ప్రజాస్వామ్య దేశమైన అమెరికాల మధ్య భాగస్వామ్యం కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాలేదని.. ప్రపంచ శాంతి, ప్రగతి మరియు ఆవిష్కరణలలో ఈ బంధం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని భారతదేశం ప్రముఖలు స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక నివాళి వీడియోలు, సందేశాలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్లో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.






