- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి సర్వం సిద్ధం.. మే 25న రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా వేడుక
రాష్ట్రపతి భవన్లో ఈ నెల 25న పద్మ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరగనుంది.

దిశ, వెబ్డెస్క్: దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలైన ‘పద్మ అవార్డుల’ (Padma Awards) ప్రదానోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 25న న్యూఢిల్లీలోని రాష్ట్రీయ భవన్లో ఈ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. వివిధ రంగాలలో దేశానికి విశేష సేవలు అందించిన ప్రముఖులకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) తన చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేయనున్నారు. అయితే, ఈ ఏడాది వివిధ రంగాలకు చెందిన మొత్తం 131 మంది ప్రతిభావంతులను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. సమాజ సేవ, కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వర్తకం-పరిశ్రమలు వంటి విభిన్న రంగాలలో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారికి ఈ గౌరవం దక్కింది.
ఈ మేరకు ఐదుగురికి పద్మ విభూషణ్. 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు అందజేయనున్నారు. రాష్ట్రపతి భవన్లోని చారిత్రాత్మక దర్బార్ హాల్లో జరగనున్న ఈ అధికారిక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, విదేశీ ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.






