- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అజిత్ పవార్ తిరుగుబాటు మా ఐక్యతపై ప్రభావం చూపదు.. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్
దిశ, వెబ్ డెస్క్: ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ తిరుగుబాటు వ్యవహారంపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ వ్యవహారం వల్ల మహా వికాస్ అఘాడీ కూటమిపై ఏమాత్రం ప్రభావం చూపదని అన్నారు. అది ఎన్సీపీకి సంబంధించిన వ్యవహారమని అన్నారు. పవార్ దేశరాజకీయాల్లో శరద్ పవార్ చాలా పెద్ద నాయకుడని, పార్టీ సంక్షోభాన్ని ఎలా తట్టుకొని నిలబడాలో ఆయనకు తెలుసునని అన్నారు. ఇక ప్రతిపక్షపార్టీల ప్రభుత్వాలను, పార్టీలను కూలగొట్టడం లక్ష్యంగా మోడీ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
అందుకోసం ఆయన ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను వాడుకుంటున్నారని అన్నారు. ఎన్సీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని ప్రధాని ఆరోపించిన రెండు రోజుల్లోనే అజిత్ పవార్ అక్కడి ప్రభుత్వంలో జాయిన్ కావడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఇదంతా డ్రామా అని ఆరోపించిన ఆయన.. మోడీ కనుసన్నల్లోనే మహారాష్ట్ర తాజా ఎపిసోడ్ నడుస్తోందని చెప్పారు.