- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎన్నికల షెడ్యూల్ వేళ కేంద్రం సంచలన నిర్ణయం
దిశ, వెబ్డెస్క్: లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. CAAపై ఇవాళే రూల్స్(విధివిధానాలు) నోటిఫై చేయనున్నట్లు సమాచారం. మతపరమైన హింస కారణంగా 2014, డిసెంబర్ 31 కంటే ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లకు పౌరసత్వం తీసుకొచ్చేలా CAA తీసుకురాగా.. ముస్లింలకు మినహాయించడంపై వివాదం నెలకొంది.
కాగా, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని 2019 లోక్సభ ఎన్నికలకు ముందే తీసుకువచ్చింది. అయితే కొన్ని ప్రాంతాలు, వర్గాల నుంచి వచ్చిన ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో సీఏఏ అమలును కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. అయితే 2024 ఎన్నికలకు ముందే దేశంలో ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్-సీఏఏను అమలు చేయాలని మోడీ సర్కార్ తీవ్రంగా కసరత్తు చేసింది. ఈ క్రమంలోనే పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు దీనికి సంబంధించి.. కొంత సమాచారాన్ని కూడా ఇచ్చారు. అంతా ఊహించినట్లుగానే ఇవాళ రాత్రే దీనిపై విధివిధానాలు ఖరారు చేయనున్నారు.