రోడ్డు మీద కరెన్సీ నోట్లు విసురుతూ యువకుడి హల్ చల్.. వామ్మో అసలు కారణం అదా..?

by Dishafeatures2 |
రోడ్డు మీద కరెన్సీ నోట్లు విసురుతూ యువకుడి హల్ చల్.. వామ్మో అసలు కారణం అదా..?
X

దిశ, వెబ్ డెస్క్: మహరాష్ట్రలోని హింగోలి టౌన్లో రోడ్డు మీద కరెన్సీ నోట్లు విసురుతూ ఓ యువకుడు హల్ చల్ చేశాడు. అయితే ఆ యువకుడు దేనికోసం అలా చేస్తున్నాడో తెలియక స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇవ వివరాల్లోకి వెళ్తే.. నాసిరకం పురుగుల మందులు అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నారని, రైతులను నిండా ముంచుతున్న ఆ సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న స్వాభిమాని కిసాన్ సంఘ్ సభ్యులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. హింగోలి ప్రభుత్వ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఆ కార్యాలయం ఎదుట గాల్లో కరెన్సీ నోట్లను చల్లుతూ నిరసన వ్యక్తం చేశారు.

రాష్ట్ర వ్యవసాయ మంత్రి అబ్దుల్ సత్తార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు 8 సంస్థలు నాసిరకం పురుగుల మందులు అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా సదరు కంపెనీలపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక యువకుడు నోట్లను గాల్లోకి విసురుతూ నిరసన వ్యక్తం చేసిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. దీంతో ‘‘నీది మామూలు ఐడియా కాదు గురూ’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ఇంతకు అవి ఒరిజినల్ నోట్లేనా అంటూ మరో నెటిజన్ ఫన్నీగా కామెంట్ పెట్టాడు.

Next Story

Most Viewed