నర్సీపట్నం వైద్యుడిపై వేటు

by  |
నర్సీపట్నం వైద్యుడిపై వేటు
X

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి మత్తు వైద్యుడు కె.సుధాకర్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇటీవల ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఒక్కో మాస్క్‌ను 15 రోజుల పాటు వాడాలన్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఆయన పై విచారణ జరిపిన ఉన్నతాధికారులు, బాధ్యతారహితంగా ప్రవర్తించడన్న కారణంతో సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా వైద్య విధాన పరిషత్తు నుంచి ఉత్తర్వులు వెలుబడ్డాయి. ఆసుపత్రి పర్యవేక్షకురాలు నీలవేణిదేవి ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Tags: Anesthetist, suspend, narsipatnam, ap news


Next Story

Most Viewed