గోదావరి పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్..

by  |
గోదావరి పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్..
X

దిశ, నిజామాబాద్ : మహరాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి.ఇప్పటికే పలుమార్లు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అక్కడి ప్రాజెక్టుల్లో నీటిమట్టం పెరుగుతూనే ఉంది. వరద ఉధృతి పెరుగుతుండటంతో మరోసారి గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ గేట్లు ఎత్తేందుకు అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ నేపథ్యంలోనే గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచిస్తూ.. శనివారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి నాందెడ్ జిల్లా కలెక్టర్ వైర్ లెస్ ద్వారా మెసేజ్ పంపించారు. ఒకవేళ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తే ముందుగా రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతం నిజామాబాద్ జిల్లాలోని బాసరపై ప్రభావం ఎక్కువగా ఉండనుంది.


Next Story

Most Viewed