గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచండి.. డీఐజీ రంగనాథ్ సూచన

by  |
Nalgonda DIG Ranganath
X

దిశ, నల్లగొండ: గణేష్ నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఐజీ రంగనాథ్ తెలిపారు. గణేష్ నిమజ్జనం జరిగే నల్లగొండ పట్టణంలోని వల్లభరావు చెరువు, 14వ మైలు రాయి అలీనగర్ చెక్ పోస్టు వద్ద వారు ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. నిమజ్జన ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రేన్లు, ఫ్లడ్ లైట్లు, బారికెడ్లు ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పటిష్ట బందోబస్తుతో పాటు సమయాన్ని పాటిస్తూ మండపాల నిర్వాహకులు నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

అదే విధంగా విద్యుత్, రెవెన్యూ, ఆర్అండ్‌బీ, పంచాయతీ, పోలీసులతో పాటు అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ, నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా ప్రతిఒక్కరూ జిల్లా యంత్రాంగంతో సహకరించాలని వారు కోరారు. వారి వెంట నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, మిర్యాలగూడ, నల్లగొండ ఆర్డీఓలు రోహిత్ సింగ్, జగదీశ్వర్ రెడ్డి, డీఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ పిల్లి రామరాజు, సీఐలు బాలగోపాల్, చంద్రశేఖర్ రెడ్డి, చీర్ల శ్రీనివాస్, టూ టౌన్ ఎస్ఐ నర్సింహులు, మున్సిపల్, రెవెన్యూతో పాటు వివిధ శాఖల అధికారులున్నారు.



Next Story