ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని.. అర్ధరాత్రి దారుణం

by  |
ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని.. అర్ధరాత్రి దారుణం
X

దిశ ఖానాపూర్: అర్ధరాత్రి యువకుడు దారుణంగా హత్యకు గురైన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఖానాపూర్ సీ.ఐ. అజయ్ బాబు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలం‌లోని సుర్జాపూర్ గ్రామానికి చెందిన రాచర్ల తిరుమలేష్ (అనిల్) వయస్సు(23)అతను అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో యువతి కుటుంబీకులు పలుమార్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినా యువకుడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో బుధవారం రాత్రి యువతి తండ్రితో పాటు కుటుంబీకులు నాగరాజు,రాజన్న,గంగన్న యువకునిపై దాడి చేశారు. యువకుడు సృహ తప్పి పోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం నిర్మల్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


Next Story

Most Viewed