సైకిలెక్కిన TRS లీడర్..!

by  |
సైకిలెక్కిన TRS లీడర్..!
X

దిశ, వెబ్‌డెస్క్ :

రాష్ట్రంలో అనుహ్యంగా టీడీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు పసుపు కండువాలు కప్పుకున్న విషయం తెలిసిందే.

తాజాగా TRS నేత సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి కారు దిగి సైకిలెక్కారు. శనివారం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ సమక్షంలో మురళీధర్ రెడ్డి TDP కండువా కప్పుకున్నారు. ఈయన ఎల్బీనగర్‌కు చెందిన నేత కావడం, ఈ నియోజకవర్గంపై ఆయనకు మంచి పట్టు ఉండటం కాగా.. మురళీతో పాటు టీఆర్ఎస్‌కు చెందిన కార్యకర్తలు పెద్దఎత్తున టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సుమారు రెండు వందల మంది టీఆర్ఎస్ కార్యకర్తలు టీడీపీలో చేరారు.


Next Story

Most Viewed