యువతిపై అత్యాచారం.. ఇద్దరు యువతుల ప్రోద్బలం!

by  |
యువతిపై అత్యాచారం.. ఇద్దరు యువతుల ప్రోద్బలం!
X

దిశ, వెబ్‌డెస్క్ : ముంబై నుంచి వచ్చిన యువతిపై హైదరాబాద్‌లోని ఓ హోటల్లో అత్యాచారం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ పోకిరీ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో కామాంధుడికి మరో ఇద్దరు యువతులు సాయం చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితురాలు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కేసును హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పొలీసులకు మహా పోలీసులు ట్రాన్స్‌ఫర్ చేశారు.

జుబేర్, స్వీటీ, ప్రజక్తలపై బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నది. కేసు వాపసు తీసుకోవాలని, లేనియెడల నగ్నవీడియాలను బయటకు విడుదల చేస్తామని నిందితులు బాధితురాలిని బెదిరిపులకు గురిచేస్తున్నారు. కాగా, అత్యాచారం కేసులో బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed