- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, హుజూరాబాద్ రూరల్: హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు. శనివారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకట్ తో కలిసి సీతక్క పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ ప్రజా వ్యతిరేఖ విధానాలు అవలంభిస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. బడుగు బహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. వెంకట్ కు ఓ అవకాశం ఇస్తే ప్రజాసంక్షేమం కోసం పాటు పడుతారన్నారు. ఏడేళ్లలో తెరాస ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని జోస్యం చెప్పారు. ఏడేళ్లు మంత్రిగా ఉండి హుజురాబాద్ అభివృద్ధి చేయలేక ఈటల చేతులెత్తేశారని విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూమి , నిరుద్యోగులకు ఉద్యోగ భృతి, తెలంగాణ ఏర్పడ్డాక ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ తుంగలో తొక్కారని విమర్శించారు. మాయ మాటలు చెప్పే కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు వారి వెంట ప్రచారంలో పాల్గొన్నారు.