ప్లీనరీలో కేటీఆర్‌ను పట్టించుకోని ఎంపీ సంతోష్!

by  |
KTR Santhosh
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్లీనరీకి వచ్చే ప్రతినిధులంతా గులాబీ డ్రస్‌తో రావాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు నాయకులంతా గులాబీ డ్రస్‌తో రాగ ఎంపీ సంతోష్ కుమార్ మాత్రం ఆయన చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కండువాతో వచ్చారు. ఆయన మాత్రం తనకు అధిష్టానం ఆదేశాలు మీకు కాని నాకు కాదన్నట్లు వ్యవహరించారు. ప్లీనరీకి వచ్చిన ప్రతినిధులు ఆయనను చూసి ఆశ్చర్యపోయారు. ఇదేంటని గుసగుసలాడుకున్నారు. పార్టీ కార్యకర్తలకు ఒక న్యాయం.. నేతలకు ఒక న్యాయమా అని పలువురు అసహానానికి గురయ్యారు. కాగా, మధ్యాహ్నం భోజనం తర్వాత ఎంపీ సంతోష్ గులాబీ కండువా కప్పుకున్నారు.



Next Story

Most Viewed