నియోజకవర్గ అభివృద్ధికి కృషి: రంజిత్‌రెడ్డి

by  |
నియోజకవర్గ అభివృద్ధికి కృషి: రంజిత్‌రెడ్డి
X

దిశ, రంగారెడ్డి: చేవెళ్ల పార్లమెంట్ నియోజకర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు ఎంపీ జి.రంజిత్‌రెడ్డి అన్నారు. సంవత్సర కాలంలో తాను పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాలు, నియోజకవర్గానికి సంబంధించిన రైల్వే సమస్యలు, కంది బోర్డు ఏర్పాటుకు రైతులతో పోరాటం, ఫార్మా సిటీ ఏర్పాటు తదితర అంశాలను మంత్రి కేటీఆర్‌కు వివరించారు. “అభివృద్ధి పరమావధిగా” చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు రంజిత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గ భవిష్యత్తు ప్రగతి ప్రణాళికపై రూపొందించిన నివేదికను కేటీఆర్‌కు సమర్పించారు.

Next Story