కాశీలో చిక్కుకున్న భక్తులు.. ఎంపీ ఆర్థిక సహాయం

by  |
కాశీలో చిక్కుకున్న భక్తులు.. ఎంపీ ఆర్థిక సహాయం
X

దిశ, రంగారెడ్డి: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సుమారు 70 మంది భక్తులు కాశీకి వెళ్లి లాక్‌డౌన్ సందర్భంగా అక్కడ చిక్కుకు పోయారు. ఈ విషయం తెలుసుకున్న చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి. రంజిత్ రెడ్డి స్పందించి వాళ్ళకి భోజనం, వసతి సదుపాయం కల్పించటంతో పాటు రూ. లక్ష ఆర్థిక సాయం చేశారు. భక్తులు త్వరగా స్వస్థలం చేరుకునెందుకు చర్యలు తీసుకుంటుంనట్టు ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. ఈ విషయంపై కలెక్టరు, సంబంధిత అధికారులతో ఎంపీ మాట్లాడారు. కరోన వైరస్ తీవ్రరూపం దాల్చిందని, ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇండ్ల నుంచి బయటకు రాకూడదని ఎంపీ రంజిత్ రెడ్డి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాను సామాజిక దూరం ద్వారా మాత్రమే కట్టడి చేయగలమన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed