సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గజానన్ మాల్యతో ఎంపీ, ఎమ్మెల్యే భేటీ

by  |
సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గజానన్ మాల్యతో ఎంపీ, ఎమ్మెల్యే భేటీ
X

దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి రైల్వే స్టేషన్ సందర్శనకై వచ్చిన సౌత్ ఇండియా సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యతో ఎంపీ, ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పలువురు కార్పొరేటర్లతో కలిసి, చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాలలోని రైల్వే సమస్యలపై చర్చించారు. ఆయా రైల్వేస్టేషన్‌లలో నెలకొన్న సమస్యలపై రైల్వే జీ.ఎంకు వినతి పత్రం అందజేశారు. సమావేశానికి ముందు రైల్వే జీఎం గజానన్ మాల్య శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్ పరిసరాలను పరిశీలించి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు.

Next Story

Most Viewed