అపోలో ఆస్పత్రిలో బండి సంజయ్‌కు చికిత్స..

by  |
అపోలో ఆస్పత్రిలో బండి సంజయ్‌కు చికిత్స..
X

దిశ, ప్రతినిధి, కరీంనగర్ : దుబ్బాకలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కరీంనగర్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కొద్ది సేపటి కిందట కరీంనగర్ ఎంపీ కార్యాలయానికి చేరుకున్న డాక్టర్లు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు.

షుగర్ లెవెల్స్ గణనీయంగా తగ్గిపోవడంతో మొదట అక్కడే వైద్య సేవలందించారు. అయితే, సంజయ్‌కు ఆయన కార్యాలయంలోనే చికిత్స అందిస్తే ఆరోగ్య పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే ప్రమాదం ఉందని వైద్యులు సూచించారు. దీంతో వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Next Story

Most Viewed