శ్మశాన వాటికలో టీజర్ లాంచ్ ఈవెంట్.. ఇది ఎక్కడి చోధ్యం రా నాయనా..!

by Disha Web Desk 5 |
శ్మశాన వాటికలో టీజర్ లాంచ్ ఈవెంట్.. ఇది ఎక్కడి చోధ్యం రా నాయనా..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సాధరణంగా మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్స్ ఏ ఈవెంట్ హల్లోనో లేక థియేటర్స్ లోనో ప్లాన్ చేస్తుంటారు. కానీ ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ ని మూవీ టీం వినూత్నంగా ఆలోచించి శ్మశానవాటికలో ప్లాన్ చేస్తున్నారు. కథానాయిక అంజలి ప్రధాన పాత్రలో శివ తుర్లపాటి దర్శకత్వంలో గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గతంలో వచ్చిన గీతాంజలి మూవీకి పార్ట్-2 గా రాబోతోంది. అయితే ఈ మూవీ టీజర్ ని శ్మశాన వాటికలో జరపాలని మూవీ టీం నిర్ణయించింది. దీనికి సంబంచిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ నెల 24న రాత్రి 7 గంటలకు ఈ ఈవెంట్ ను బేగంపేట్ శ్మశానవాటికలో జరుపుతున్నట్లు మూవీటీం ప్రకటించింది. 2014 లో హరర్ నేపధ్యంలో విడుదల అయిన గీతాంజలి సినిమా భారీ విజయం సొంతం చేసుకోగా, దీనికి సీక్వెల్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాను త్వరలో విడుదల చేయనున్నారు. అయితే ప్రమోషన్ లో భాగంగా టీజర్ ను శ్మశాన వాటికలో రిలీజ్ చేయాలనే వినూత్నమైన ఆలోచనను కొందరు తప్పుపడుతుండగా, మరికొందరు మెచ్చుకుంటున్నారు.

Read More..

తడి తడి అందాలతో కవ్విస్తున్న అనుపమ.. ఆ హోయలు చూడతరమా..



Next Story

Most Viewed