రష్మిక పతనం స్టార్ట్..?? మళ్లి క్రేజ్‌లోకి త్రిష..

by Disha Web Desk 7 |
రష్మిక పతనం స్టార్ట్..?? మళ్లి క్రేజ్‌లోకి త్రిష..
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందాన. పుష్ప సినిమాతో ఆల్ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ దక్కించుకున్న ఈమె.. ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది. ఇక దీంతో ఆమెకు అవకాశాలు చేజారుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే.. ప్రముఖ ఆభరణాల రిటైల్ సంస్థ ఖజానా జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రష్మికను తొలిగించినట్లు తెలుస్తోంది. ఆమెపై కర్ణాటకలో జరుగుతున్న వివాదాల కారణంగా రష్మికకు బదులుగా.. ఆ స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిషను తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఈ విషయమై ఖజానా జ్యువెలరీ చైర్పర్సన్ మిస్టర్ కిషోర్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. కొన్ని అనివార్య కారణాల వల్ల రష్మికకు బదులుగా త్రిషను తీసుకోబోతున్నామని తెలిపినట్లు సోషల్ మీడియలో వార్తలు గుప్పుమంటున్నాయి. అదే గనుక జరిగితే రష్మిక పతనం స్టార్ట్ అయినట్లేనని అనుకుంటున్నారు అభిమానులు. కాగా.. ఖజానాకు గతంలో కాజల్ అగర్వాల్ బ్రాండ్ అంబాసిడర్‌‌గా వ్యవహరించగా.. ఆమెను తొలగించి నేషల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న కారణంగా రష్మికను బ్రాండ్ అంబాసిడర్‌గా చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి : సమంత ఫ్యాన్స్‌కు పండగే.. దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన?

Next Story

Most Viewed