చనిపోయిన శ్రీదేవితో కారులో షికారు చేస్తున్న ఆర్జీవీ.. పిచ్చి ముదిరిపోయిదంటున్న నెటిజన్స్!

by Disha Web Desk 8 |
చనిపోయిన శ్రీదేవితో కారులో షికారు చేస్తున్న ఆర్జీవీ.. పిచ్చి ముదిరిపోయిదంటున్న నెటిజన్స్!
X

దిశ, సినిమా : వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. వివాదాల్లో తలదూర్చడమే కాకుండా వివాదాలు సృష్టించడంలో కూడా ఈయనకు మించిన తోపులేరంటారు ఈయన అభిమానులు. ఇక ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాడు.

అయితే ఈయన ఏ పని చేసినా అదో సెన్సేషన్ అనే చెప్పాలి. ఒకప్పుడు కాంట్రవర్సీ సినిమాలు, రొమాంటిక్ చిత్రాలు తీస్తూ వచ్చిన ఆర్జీవీ ఇప్పుడు అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అమ్మాయిల అందాలను పొగుడుతూ.. వారితో బోల్డ్‌గా మాట్లాడుతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాడు. అయితే తాజాగా ఈయన చేసిన ఓ పని చూసిన నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా తిట్టిపోస్తున్నారు. అసలేమైదంటే.. ఆర్జీవీకి శ్రీదేవి అంటే చాలా ఇష్టం. ఆమె అందానికే ఆయన బానిసై పోయారు. అంతే కాదు ఆమెకు పెద్ద భక్తుడు వర్మ. ఆయన ఎప్పుడూ ఆమెను పొగుడుతూనే ఉంటాడు. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ, చనిపోయిన శ్రీదేవితో కారులో హాయిగా షికారు చేస్తున్నట్లు ఓ ఫోటో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో శ్రీదేవి వర్మ పక్కన కూర్చొని డ్రైవింగ్ చేస్తుంటే.. ఆయన సిగరేట్ తాగుతూ కనిపించాడు. ఇక ఆ ఫొటోకు క్యాప్షన్ ఇస్తూ.. శ్రీదేవిని చూడటానికి స్వర్గానికి వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఇది చూసిన నెటిజన్స్ వర్మ నువ్వు ఏం చేస్తున్నావ్ అసలు.. నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది అంటూ తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read More..

ఓయమ్మో.. మజిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ హీరోయిన్స్‌ను మించిన అందంతో కవ్విస్తున్నదిగా!

Next Story

Most Viewed