‘వ్యూహం’ సెన్సార్ సర్టిఫికెట్‌‌ను హైకోర్టుకు సమర్పించిన నిర్మాత

by Disha Web Desk 2 |
‘వ్యూహం’ సెన్సార్ సర్టిఫికెట్‌‌ను హైకోర్టుకు సమర్పించిన నిర్మాత
X

దిశ, వెబ్‌డెస్క్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాపై దాఖలైన పిటిషన్‌‌ను సోమవారం తెలంగాణ హైకోర్టు విచారించింది. సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌తో పాటు రికార్డులను సెన్సార్ బోర్డు కోర్టుకు సమర్పించింది. సెన్సార్ సర్టిఫికెట్‌తో పాటు రికార్డులను పరిశీలించిన తర్వాత విచారణ జరుపుతామని కోర్టు పేర్కొంది. అంతేకాదు.. రేపు(మంగళవారం) మరోసారి వాదనలు వింటామని తెలిపింది.

ఈ నేపథ్యంలో తదుపరి విచారణను రేపటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. సినిమా విడుదల ఆగిపోవడం వల్ల కోట్ల రూపాయల నష్టం వాటిల్లితుందని చిత్ర యూనిట్ వాదిస్తోంది. సినిమాకు సంబంధం లేని వ్యక్తులు కుట్రపూరితంగా పిటిషన్ దాఖలు చేశారని అంటోంది. ఈనెల 11 వరకు వ్యూహం సినిమా విడుదల నిలిపివేస్తూ కొద్ది రోజుల క్రితం సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed