పల్లవి ప్రశాంత్‌ రైతు అని చిన్న చూపు చూస్తున్నారు.. వారిపై ఫైర్ అయిన అఖిల్ సార్థక్

by Disha Web Desk 6 |
పల్లవి ప్రశాంత్‌ రైతు అని చిన్న చూపు చూస్తున్నారు.. వారిపై ఫైర్ అయిన అఖిల్ సార్థక్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-7 రెండో వారం నామినేషన్స్ ఓ రేంజ్‌లో జరిగాయి. రైతు బిడ్డ అయిన పల్లవి ప్రశాంత్‌ను సీరియల్ బ్యాచ్ అంతా నామినేట్ చేశారు. ముఖ్యంగా అమర్ దీప్ అరేయ్ రా అంటూ కాస్త హద్దు దాటి మాట్లాడాడు. కానీ ప్రశాంత్ మాత్రం నోరు జారకుండా అన్నా అంటూ మర్యాద ఇచ్చాడు.

తాజాగా, ఈ వ్వవహారంపై బిగ్‌బాస్ రన్నర్ అఖిల్ సార్థక్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశాడు. అఖిల్ మాట్లాడుతూ.. ‘‘ పల్లవి ప్రశాంత్‌కు అందరూ భయపడ్డారు. అందరూ అతడిని టార్గెట్ చేశారు. రైతు బిడ్డ నువ్వు స్ట్రాంగ్‌గా ఉండు. ఆర్టిస్టులమైన మనకే బిగ్‌బాస్ అంటే ఎంతో ఎగ్జయిట్‌గా ఫీలవుతాము. ఏదో ఒకటి చేయాలని తాపత్రయపడతాం. అలాంటిది ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అతను ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో సంబరపడ్డాడు. హౌస్‌లో ఉన్న అందరిలాగే ఏదో ఒకటి చేయాలని ప్రయత్నించాడు. అందులో తప్పేం ఉంది. కొందరైతే పల్లవి ప్రశాంత్ గురించి అధ్యయనం చేసి మరీ వచ్చారు. కానీ, అతడు మిగతా కంటెస్టెంట్ల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు.

తన ఆట తను ఆడేందుకు వచ్చాడు. నామినేషన్స్‌లో పల్లవి ప్రశాంత్‌ను చూస్తే బాధేసింది. ఎవరూ అతడిని మాట్లాడినివ్వడం లేదు. పైగా కొందరు అరేయ్ రా.. అంటూ వల్గర్‌గా మాట్లాడారు. అతను ఒక రైతు అని చులకన చేస్తున్నారు చాలా చిన్నచూపు చూస్తున్నారని పించింది. అందరూ తనను డామినేట్ చేస్తున్నారు. ఉల్టాపుల్టా నమినేషన్స్ అంటే అందరూ మాట్లాడుతారు కానీ, అతడిని మాత్రం మాట్లాడనివ్వరన్నమాట! వాళ్ళు చెప్పే పాయింట్స్ కరెక్ట్.. కానీ అతడిని మాట్లాడనివ్వకపోవడం అసలు కరెక్ట్ కాదు. వీళ్లందరూ ఫుటేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ సీజన్ నిజంగా ఉల్టా పుల్టా’’ అంటూ అఖిల్ ఫైర్ అయ్యాడు. అంతేకాకుండా స్ట్రాంగ్‌గా ఉండు రైతు బిడ్డ జై జవాన్.. జై కిసాన్ అని క్యాప్షన్ జత చేశాడు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed