డైరెక్టర్ అట్లీపై కోపంగా ఉన్న నయనతార.. ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చేసిందిగా..

by Disha Web Desk 7 |
డైరెక్టర్ అట్లీపై కోపంగా ఉన్న నయనతార.. ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చేసిందిగా..
X

దిశ, వెబ్‌డెస్క్: అట్లీ డైరెక్షన్‌లో వచ్చిన తాజా సినిమా ‘జవాన్’. షారుఖ్, దీపిక, నయనతార ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకుంది. అంతే కాకుండా దాదాపుగా రూ. 900 కోట్లకు పైగా వసూల్ రాబట్టి.. అన్ని భాషల్లోనూ బ్రేక్ ఈవెన్ అందుకుంది. అయితే.. ఈ సినిమాలో నయనతార కంటే దీపిక పదుకొణెకు ఎక్కువ మార్కులు పడినట్లు తెలుస్తోంది. షారుఖ్, దీపిక సీన్లే ఎక్కువగా హైలెట్ అయ్యానని కూడా టాక్. దీంతో నయన్ డైరెక్టర్ అట్లీపై సీరియస్‌గా ఉన్నట్లు నెట్టింట రచ్చ నటుస్తోంది.

అయితే.. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదు అని తేల్చేసింది నయన్. ఈ మేరకు.. నిన్న డైరెక్టర్ అట్లీ పుట్టిన రోజు కావడంతో ఆయనకు బర్త్‌డే విషెష్ చెబుతూ ‘మీమ్మల్నీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది’’ అంటూ పొగిడేసింది. దీంతో అట్లీపై నయన్ సీరియస్‌గా ఉంటే బర్త్‌డే కు పోస్ట్ ఎందుకు పెడుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఫైనల్‌గా నయన్ పెట్టిన పోస్ట్‌తో గాలి వార్తలకు చెక్ పెట్టినట్లయింది.

Next Story

Most Viewed