భార్యకు నెలకు పది లక్షలు ముట్ట చెప్తున్నా కేసు పెట్టింది.. పిల్లలను బంధించి..

by Disha Web Desk 17 |
భార్యకు నెలకు పది లక్షలు ముట్ట చెప్తున్నా కేసు పెట్టింది.. పిల్లలను బంధించి..
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ సైలెన్స్ బ్రేక్ చేశాడు. ఇన్నాళ్లుగా భార్య అలియా పెడుతున్న టార్చర్ గురించి వివరించాడు. ఈ మధ్య నవాజ్ పిల్లలతో సహా తనను ఇంటి నుంచి బయటకు గెంటేశాడని తెలుపుతూ వీడియో పోస్ట్ చేయగా.. పిల్లలకు నిజం తెలియాలనే ఉద్దేశంతో తప్పక స్పందించాల్సి వచ్చిందన్నాడు. దుబాయ్‌లో స్కూల్‌కు వెళ్లే తన పిల్లలు ఎందుకు ఇండియాలో ఉన్నారని ప్రశ్నించాడు. నాలుగు నెలలుగా తన కొడుకు, కూతురును బంధించి స్కూల్‌కు వెళ్లనివ్వకుండా డ్రామాలు చేస్తోందని చెప్పుకొచ్చాడు. తనకు రోజూ పిల్లలు స్కూల్‌కు హాజరుకాలేదని కాల్ వస్తూనే ఉందన్నాడు.

ఇక అలియాతో విడాకులు తీసుకున్నాక.. మళ్లీ కలిసింది కేవలం కన్నబిడ్డల కోసమే అన్నాడు. ఈ క్రమంలో స్కూల్ ఫీజులు, మెడికల్, ట్రావెల్, లీజర్ యాక్టివిటీస్ కాకుండానే.. ఆమెకు నెలకు 10 లక్షల చొప్పున ఇచ్చుకుంటూ వచ్చానని, దుబాయ్‌‌లో లగ్జరీ హౌజ్ కూడా రాసిచ్చానని తెలిపాడు. ఇక ఆమె సెటిల్ అయితే పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో.. ఫిల్మ్ కాస్టింగ్‌కు ఫినాన్స్ చేశానని చెప్పాడు. ఆ తర్వాత లగ్జరీ కార్స్ కొన్న ఆమె.. సడెన్‌గా వాటిని, ఇంటిని అమ్మేసిందని.. మళ్లీ డబ్బుల కోసం తనపై, తల్లిపై కేసు పెట్టిందన్నాడు.

పిల్లలు ఇండియా వస్తే నానమ్మ దగ్గర ఉండేందుకే ఇష్టపడుతుంటారు. అలాంటప్పుడు ఆమె ఇంటి నుంచి ఎలా గెంటేస్తుందని ప్రశ్నించాడు. ఇన్ని డ్రామాలతో వీడియోలు తీసే అలియా.. పిల్లలను బయటకు గెంటుతున్నప్పుడు వీడియో ఎందుకు తీయలేదని అడిగాడు. ఏదేమైనా తను సంపాదించేదే పిల్లల భవిష్యత్తు కోసం, వారి బాగుకోసం అయినప్పడు.. తను పిల్లలపై కురిపించే ప్రేమను ఎవరూ అడ్డుకోలేరని, వారి కోసం ఎంత దూరమైనా వెళ్తానని ముగించాడు.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story

Most Viewed