- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నాగచైతన్య స్పెషల్ పోస్టు.. సమంతను మిస్స్ అవుతున్నాడంటున్న ఫ్యాన్స్
దిశ, వెబ్డెస్క్ : విడాకుల అనంతరం సమంత, నాగచైతన్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మరోసారి సామ్, చై ఇష్యూ సోషల్ మీడియాల్ హల్ చల్ అవుతుంది. కానీ ఈ సారి సమంత తరఫున కాదండోయ్.. నాగచైతన్య పెట్టిన పోస్టుతో అభిమానులు హడావుడీ చేస్తున్నారు. నాగచైతన్య విక్రమ్ కే.కుమార్ దర్శకత్వంలో వస్తున్న థాంక్యూ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో హీరో నాగచైతన్య మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే చైతూ తన ట్విట్టర్ అకౌంట్లో ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
అందులో నేను థాంక్స్ చెప్పాల్సిన ముగ్గురు వ్యక్తులంటూ రాసుకొచ్చారు. నా జీవితంలో నేను ముగ్గురికే థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను.. ఒకటి అమ్మ , రెండు నాన్న, మూడు హాష్ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా అటు, సమంత అభిమానులు, ఇటు అక్కినేని అభిమానులు షాక్ అయ్యారు. పలువురు పలువిధాలుగా స్పందిస్తూ.. కామెంట్ల వర్షం కురిస్తున్నారు. సామ్ ఫ్యాన్స్.. చై కావాలనే సమంత పెంచుకుంటున్న పెట్ ఫొటోను షేర్ చేసి ప్రమోషన్ చేసుకుంటున్నాడు అని మండిపడుతుంటే.. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం.. చై సామ్ని మర్చిపోవడం లేదు.. అందుకే సమంతకు థాంక్స్ చెప్పాడు. వీరిద్దరూ మళ్లీ కలవాలని కోరుకుంటున్నాను అని కామెంట్ చేస్తున్నారు. ఇంకొకరు కుక్క పిల్లకు థాంక్స్ చెప్పావు.. మరీ మీ భార్య సామ్ కి థాంక్స్ చెప్పరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇష్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సమంత, ఈ పోస్టుపై ఎమైనా స్పందిస్తుందో లేదో వేచి చూడాలి మరి.
#themagicwordisthankyou Thank you - A word I use often but not often enough where it matters the most . My next release #thankyouthemovie reflects this thought .. something that has moved me through the journey of the film . pic.twitter.com/FqGQmj0KsB
— chaitanya akkineni (@chay_akkineni) July 6, 2022