- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కన్న కొడుకును కడతేర్చిన కసాయి తండ్రి
by Disha Web Desk 23 |
X
దిశ,కరీంనగర్ రూరల్: కళ్లల్లో కారం పొడి చల్లి, తలపై రోకలి బండతో కొట్టి కన్న కొడుకును కడతేర్చిన ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చింతకుంట గ్రామానికి చెందిన పెరుమాళ్ళ శివ సాయి (21) హైదరాబాదులో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వారం రోజుల క్రితం ఇంట్లో శుభకార్యానికి వచ్చిన శివ సాయి ని కన్నతండ్రి పెరుమండ్ల శ్రీనివాస్ (50) శుక్రవారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో కళ్ళల్లో కారం పొడి చల్లి,రోకలి బండతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. తల్లి ఉపాధి హామీ పనికి వెళ్లగా కొడుకు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం నిందితుడు కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story