కాంగ్రెస్ కు ఓటేస్తే దేశంలోని ప్రతి హిందూ మహిళకు ప్రమాదం

by Disha Web Desk 15 |
కాంగ్రెస్ కు ఓటేస్తే దేశంలోని ప్రతి హిందూ మహిళకు ప్రమాదం
X

దిశ, నిజామాబాద్ సిటీ : కాంగ్రెస్ పార్టీకి మహిళలు ఓట్లు వేస్తే హిందూ మహిళలు ప్రమాదంలో పడడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ తలాక్ బిల్లును తమ బీజేపీ ప్రభుత్వం తెస్తే దాన్ని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతుందని విమర్శించారు. తాము త్రిబుల్ తలాక్ ప్రస్తావన తెచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూనే వస్తుందని ఆయన అన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి మహిళలు ఓటు వేస్తే హిందువు మహిళలు తమ ఆత్మ గౌరవాన్ని, భద్రతను కోల్పోవాల్సి వస్తుందన్నారు. దేశంలో జరిగే ఏ ఎన్నికలైనా మహిళా ఓటు బ్యాంకు కీలకమని, ఎన్నికల్లో పోటీ చేసే

అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించేది కేవలం మహిళా ఓటర్లేనని ఆయన స్పష్టం చేశారు. అర్బన్ నియోజకవర్గంలో బీజేపీకి మహిళా మోర్చా తరపున పెద్ద ఎత్తున మహిళలు మద్దతు తెలుపుతున్నారని, దీన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన అన్నారు. అదే విధంగా అర్బన్ నియోజకవర్గం నుంచి అరవింద్ సమక్షంలో మహిళలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే దంపాల్ సూర్యనారాయణ గుప్తా, మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పంచ రెడ్డి ప్రవళిక, జగిత్యాల ఇన్చార్జి భోగ శ్రావణి, మహిళా కార్పొరేటర్లు నిచేంగ్ లతా కృష్ణా తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed