- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రజలను మభ్య పెట్టి రాజకీయ లబ్ధిపొందారు
దిశ,కార్వాన్ : 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ప్రజలను మభ్య పెట్టి రాజకీయ లబ్ధి పొందిందని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరీ వెంకట్ అన్నారు. శుక్రవారం గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద బల్మూరీ వెంకట్ ,రాములు నాయక్, మహిళ నాయకులు, కార్యకర్తలతో కలిసి అమరవీరుల స్థూపాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీష్ రావు అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి మలినం చేశారని, పసుపు నీళ్లతో ఆ మలినాన్ని శుద్ధి చేశామన్నారు.
ఆగస్టు 15 లోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని, అమలు చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని సవాల్ విసిరారు. హరీష్ రావు తన రాజీనామా తో కొత్త డ్రామాకు తెర తీశారన్నారు. హరీష్ రావు కు గత 10 సంవత్సరాలుగా అమరవీరులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. రాజీనామా లేఖను ఏ విధంగా పంపాలో కూడా హరీష్ రావుకు అవగాహన లేదన్నారు. 2 లక్షల రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆగస్టు 15 లోగా ఇచ్చిన మాట ప్రకారం హామీని నెరవేరుస్తామని, అమలు తర్వాత తాను బాధ్యత తీసుకొని హరీష్ రావు రాజీనామాను ఆమోదించేలా చేస్తామని తెలిపారు.