ఓటీటీలోకి మరో విలేజ్ డ్రామా ‘మట్టి కథ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

by Disha Web Desk 9 |
ఓటీటీలోకి మరో విలేజ్ డ్రామా ‘మట్టి కథ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
X

దిశ, సినిమా: ఈ మద్యకాలంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో వచ్చిన సినిమాలు మంచి హిట్ అందుకుంటున్నాయి. ఇందులో భాగంగా తాజాగా అచ్చమైన పల్లెటూరి సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకున్న మూవీ ‘మట్టి కథ’. సెప్టెంబర్‌ 22 విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల విషయం పక్కనపెడితే ప్రేక్షకుల మనసు మాత్రం దోచింది. అంతేకాదు ఈ సినిమా ఏకంగా 9 అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలీం ఫెస్టివల్‌లో పలు విభాగాల్లో 9 అవార్డులను కొల్లగొట్టింది. దీంతో ఇప్పుడు ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ కాగా తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా వేదికగా ‘మట్టి కథ’ అక్టోబర్ 13 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. మరి ‘బలగం’ వంటి కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఓటీటీలో ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.


Next Story

Most Viewed