జయకృష్ణ మనసు దోచిన మంగ.. ‘శ్రీనివాస మంగాపురం’సెకండ్ సింగిల్ అప్డేట్!

by Mallepaka Hamsa |

చిత్రబృందం సెకండ్ సింగిల్ అప్‌డేట్‌ను ఇచ్చింది. ‘మంగా మంగా’ అంటూ సాగే ఈ పాటను మే 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

జయకృష్ణ మనసు దోచిన మంగ.. ‘శ్రీనివాస మంగాపురం’సెకండ్ సింగిల్ అప్డేట్!
X

దిశ, సినిమా: ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు వెండితెరకు పరిచయం కాబోతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. ఈ సినిమాలో జయకృష్ణ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా టాండన్ నటిస్తోంది. ఈమెకు కూడా ఇది టాలీవుడ్‌లో మొదటి సినిమా కావడం విశేషం. ‘మంగళవారం’, ‘ఆర్‌ఎక్స్ 100’ వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే పక్కా యాక్షన్ ఓరియెంటెడ్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇందులో ఒక కీలక పాత్రలో కనిపించబోతుండటం సినిమాకు మరో పెద్ద అసెట్.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మ్యూజికల్ జర్నీలో భాగంగా విడుదల చేసిన మొదటి సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్రబృందం సెకండ్ సింగిల్ అప్‌డేట్‌ను ఇచ్చింది. ‘మంగా మంగా’ అంటూ సాగే ఈ పాటను మే 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో జయకృష్ణ తన ‘మంగ’ రాషాను చూస్తూ ఉండిపోయిన స్టిల్ ఎంతో క్యూట్‌గా ఉంది. వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై మ్యాజిక్ చేయబోతోందని ఈ పోస్టర్ చూస్తుంటే అర్థమవుతోంది. వైజయంతీ మూవీస్ సమర్పణలో, చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో అజయ్ భూపతి మార్క్ రా అండ్ రస్టిక్ యాక్షన్‌తో పాటు ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కూడా ఈ సినిమాలో ఉండబోతోందని తెలుస్తోంది. ఘట్టమనేని అభిమానులు తమ కొత్త హీరోను వెండితెరపై చూసేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Next Story