గేమ్ ఛేంజర్.. రిలీజ్ డేట్ వాయిదా...!

by Disha Web Desk 1 |
గేమ్ ఛేంజర్.. రిలీజ్ డేట్ వాయిదా...!
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా చాలా సినిమాల షెడ్యూల్స్ అస్తవ్యస్తమయ్యాయి. ఈ సెగ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కు ఎక్కువ తగిలిందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఆయన దర్శకత్వంలో కమలహాసన్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు-2 చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా రాంచరణ్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ ఛేంజర్‌ సినిమా కూడా వచ్చే ఏడాది జనవరిలోని విడుదల చేసేందుకు ఆ చిత్ర బృందం ప్లాన్ చేశారు. కానీ, ఇప్పుడు భారతీయుడు-2 సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుండడంతో గేమ్ ఛేంజర్ సినిమా ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేస్తారంటూ సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఈ విషయంపై చిత్ర బృందం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం రాంచరణ్ కూడా గ్లోబల్ స్టార్ పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. తన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాను శంకర్ అత్యద్భుతంగా, ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. చిత్రంలో రాంచరణ్ కు జంటగా హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. నిర్మాతలు చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ విడుదల చేయనుండడం విశేషం.

Read more:

‘పుష్ప 2’ను టార్గెట్ చేసిన బాలీవుడ్.. బాయ్‌కాట్ చెయ్యాలంటూ ప్రచారం



Next Story