- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తల్లిదండ్రులపై ఆసక్తికర పోస్ట్ పెట్టిన దుల్కర్.. అంతా నా అదృష్టం అంటూ ఎమోషనల్
దిశ, సినిమా: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడిగా దుల్కర్ సల్మాన్ ప్రేక్షకులకు పరిచయం అయి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా తెలుగులో ‘సీతారామం’ సినిమా చేసి ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ మూవీ విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో దుల్కర్ దూసుకుపోతున్నాడు. వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్షన్లో లక్కీ భాస్కర్ మూవీ చేస్తున్నాడు. ఇది తొందరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, దుల్కర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు.
నేడు మమ్ముట్టి, సల్ఫత్ 45వ వార్షికోత్సవం కావడంతో ఈ విషయాన్ని తెలుపుతూ దుల్కర్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘‘ మీ ఇద్దరి 45 సంవత్సరాల బంధం ప్రపంచ లక్ష్యాలను అందిస్తున్నాయి! మీ స్వంత మార్గాల్లో మీరు మీ చిన్న ప్రపంచాన్ని సృష్టించారు. దానిలో నేను భాగమై, మీ ప్రేమను పొందడం నా అదృష్టం. హ్యాపీ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అమ్మ, నాన్న. మీరిద్దరూ కలిసి అత్యంత అసాధారణమైన వాటిని కూడా సాధిస్తారు’’ అంటూ రాసుకొచ్చాడు. అలాగే తన తల్లిదండ్రులు కలిసి ఉన్న ఫొటోలు షేర్ చేశాడు. దీంతో అది చూసిన నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.