మోనాలిసా ప్రేమ పెళ్లిపై దర్శకుడు సంచలన పోస్ట్.. షాకింగ్ విషయాలు వెల్లడి

by Mallepaka Hamsa |

మోనాలిసాను హీరోయిన్‌గా పరిచయం చేస్తానని గతంలో ప్రకటించిన ఆయన, తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ పెళ్లిని ఆయన 'లవ్ జిహాద్'గా అభివర్ణించడం గమనార్హం.

మోనాలిసా ప్రేమ పెళ్లిపై దర్శకుడు  సంచలన పోస్ట్.. షాకింగ్ విషయాలు వెల్లడి
X

దిశ, సినిమా: మహాకుంభమేళాలో తన నీలి కళ్లతో సోషల్ మీడియాను షేక్ చేసిన వైరల్ గర్ల్ మోనాలిసా భోంస్లే పెళ్లి వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా, యూపీకి చెందిన నటుడు ఫర్మాన్ ఖాన్‌తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే వీరి పెళ్లికి మోనాలిసా తండ్రి జై సింగ్ భోంస్లే అంగీకరించలేదు. దీంతో ఈ జంట కేరళకు పారిపోయి, అక్కడ తిరువనంతపురంలోని ఒక ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. తన తండ్రి నుండి ప్రాణహాని ఉందంటూ మోనాలిసా కేరళ పోలీసులను ఆశ్రయించి రక్షణ కోరడం గమనార్హం. తాను మేజర్ అని, తన ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నానని ఆమె స్పష్టం చేసింది. ఈ పెళ్లిపై ప్రముఖ దర్శకుడు సనోజ్ మిశ్రా స్పందించడం ఈ వివాదాన్ని మరింత పెంచింది.

మోనాలిసాను హీరోయిన్‌గా పరిచయం చేస్తానని గతంలో ప్రకటించిన ఆయన, తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ పెళ్లిని ఆయన 'లవ్ జిహాద్'గా అభివర్ణించడం గమనార్హం. ‘‘ఆమె అమాయకత్వాన్ని చూసి సినిమాల్లో అవకాశం ఇద్దామనుకున్నాను, ట్రైనింగ్ కూడా ఇప్పించాను. కానీ ఈ వార్త విన్నాక నా మనసు ముక్కలైంది. ఇది నా జీవితంలో అత్యంత కష్టమైన సమయం. గంగా స్వచ్ఛత, ఆమె ప్రకృతి స్వరూపం నాకు నచ్చాయి. అందుకే ట్రైనింగ్ ఇప్పించాను. ప్రపంచం దానిని స్వాగతించాయి. కానీ కొందరు తప్పుడు ఆరోపణలపై నన్ను జైలుకు పంపారు. నేను జైలులో ఉన్నప్పుడు కథ రాశాను. మోనాలిసాను నేను గంగా మాత అవతారంగా భావించాను. కానీ ఇలా చేసింది’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మోనాలిసా ఫేమస్ అయిన కొత్తలో ఆమెపై చాలా వివాదాలు వచ్చాయని, అవి తన ప్రాజెక్ట్‌ను ప్రభావితం చేశాయని మిశ్రా పేర్కొన్నారు. ఆమె కోసం ప్రత్యేకంగా స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశానని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వివాదంపై సోషల్ మీడియాలో రెండుగా విడిపోయారు. కొందరు డైరెక్టర్‌కు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ఒకరి వ్యక్తిగత జీవితంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శిస్తున్నారు. మరికొందరు జీవితం నాశనం చేసుకుందని అంటున్నారు. మొత్తానికి మహాకుంభ మేళా సుందరి పెళ్లి వ్యవహారం ఇప్పుడు నేషనల్ వైడ్ టాపిక్ అయ్యింది.

Next Story