నటుడు పోసాని కృష్ణ మురళికి కరోనా పాజిటివ్.. ఆసుపత్రికి తరలింపు

by Dishanational2 |
నటుడు పోసాని కృష్ణ మురళికి కరోనా పాజిటివ్.. ఆసుపత్రికి తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్ : తగ్గిపోయింది అనుకున్న కరోనా మళ్లీ మొదలైంది. తాజాగా రాష్ట్రల్లో కరోనా కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. ఇక గతంలో ఎంతో మంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కరోనా భారిన పడిన విషయం తెలిసిందే. అంతే కాకుండా కొందరు తమ ప్రాణాలను సైతం కోల్పోయారు.

కాగా, తాజాగా నటుడు, ఏపీ ప్రభుత్వ చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పోసాని కృష్ణ మురళికి కరోనా పాజిటివ్ వచ్చింది.దీంతో ఆయనను తన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. అయితే పోసాని పూణేలో జరిగిన షూటింగ్‌లో పాల్గొని నిన్ననే హైదరాబాద్‌కు రావడం జరిగిందంట. దీంతో కాస్త అస్వస్థగా ఉండటంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా, కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.

ఇవి కూడా చదవండి: Shehnaaz Gill: స్టార్ హీరో నంబర్ బ్లాక్ చేసిన నటి.. అదే కారణమట!


Next Story

Most Viewed