ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న చిరంజీవి..వెబ్ సిరీస్‌ను ఒకే చేశారా?

by Disha Web Desk 8 |
ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న చిరంజీవి..వెబ్ సిరీస్‌ను ఒకే చేశారా?
X

దిశ, సినిమా : ప్రస్తుతం ఓటీటీ హవా నడుస్తోంది.చాలా మంది స్టార్ సెలబ్రిటీస్ ఓటీటీ వైపే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.ఇప్పటికే నాగచైతన్య, సమంత, కాజల్ అగర్వాల్, లావణ్య త్రిపాఠీ ఇలా చాలా మంది ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.కాగా వారి బాటలోనే మెగాస్టార్ చిరు వెళ్లనున్నారంట.

ఆయన ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.చిరంజీవి ఓటీటీ సిరీస్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నట్లు ఆ మధ్య గుస గుసలు వినిపించాయి. కాగా తాజాగా ఆయన ఓటీటీలో వెబ్ సిరీస్‌ను ఓకే చేసినట్లు సమాచారం.ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో చిరంజీవి ఓ వెబ్ సిరీస్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఎలాంటి సిరీస్ చేస్తున్నారనే విషయంపై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు.ఇక ప్రస్తుతం చిరంజీవి బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వషిష్ట దర్వకత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిరు ఈ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నట్లు తెలస్తోంది. ఇక ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఇటీవల మూవీ మేకర్స్ తెలిపిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed