క్యాన్సర్ తో బాధపడ్డ తన భార్య ఫోటోను షేర్ చేసిన బాలీవుడ్ స్టార్..!

by Dishafeatures1 |
క్యాన్సర్ తో బాధపడ్డ తన భార్య ఫోటోను షేర్ చేసిన బాలీవుడ్ స్టార్..!
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాకు తాహిరా కశ్యప్‌తో వివాహమై 15 ఏళ్లు అవుతోంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా ఆయుష్మాన్ ఖురానా తన భార్య వెరైటీ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎందుకంటే తాహిరాల వ్యక్తిగత జీవితం 2019లో అనేక సంక్షోభాలను ఎదుర్కొంది. తనకు ‘స్టేజ్ 0’ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ తర్వాత ఆమెకు అనేక చికిత్సలు అందించారు. మొత్తనికి తాహిరా క్యాన్సర్‌ను జయించింది. ఇక నిన్న క్యాన్సర్ డే సందర్భంగా ఆయుష్మాన్ తన భార్య బేర్ ఫోటోను షేర్ చేశారు. ఇందులో తాహిరా ఎలాంటి టాప్ వేసుకోకుండా బ్యాక్ సైడ్ తిరిగి ఉంది. కాగా ఈ ఈ ఫోటోను పంచుకుంటూ, ఆయుష్మాన్ ఇలా వ్రాశాడు, ‘నేను పంజాబ్ విశ్వవిద్యాలయంలో సమోసాలు తినడం, టీ తాగడం చూసిన అమ్మాయిని ప్రేమిస్తున్నాను’ అని ఆయుష్మాన్ చేసిన ఈ పోస్ట్‌పై, అభిమానులు తాహిరాను ప్రశంసిస్తున్నారు.







Next Story

Most Viewed