నా పిల్లలు నందమూరి వారసులే.. ఆలేఖ్య రెడ్డి షాకింగ్ పోస్ట్?

by Dishanational2 |
నా పిల్లలు నందమూరి వారసులే.. ఆలేఖ్య రెడ్డి షాకింగ్ పోస్ట్?
X

దిశ, వెబ్‌డెస్క్ : నందమూరి తారకరత్న అతి చిన్న వయసులోనే గుండెపోటుతో మరణింంచిన విషయం తెలిసిందే. ఇక ఈయన ఆలేఖ్యరెడ్డిని వివాహం చేసుకోవడం, ఇది తన ఫ్యామిలీకి నచ్చకపోవడంతో చాలా రోజులు వాళ్ల కుటుంబానికి దూరంగా బతికాడు. ఇక ఈ మధ్యనే ఫ్యామిలీతో కలిసి సంతోషంగా ఉంటున్నాం అనుకునేలోపే తారకరత్న అందరికీ దూరమయ్యాడు.

దీంతో ఇప్పుడిప్పుడే భర్త లేడు అనే బాధ నుంచి బయటడుతున్న ఆలేఖ్య, సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయింది. తారకరత్నకు సంబంధించిన ఫొటోస్ షేర్ చేస్తూ.. తన గురించి చెబుతూ భర్తతో ఉన్న మధుర జ్ఞాపకాలను పంచుకుంటోంది.

ఇక ఈ విషయంపై ప్రముఖ అనలిస్టు దాము బాలాజీ మాట్లాడుతూ.. ఆమె భర్త లేని బాధ నుంచి డిప్రెషన్ నుంచి బయటపడడానికి సోషల్ మీడియాను ఎంచుకున్నట్లు అనిపిస్తోంది. ఇక పిల్లలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ముఖ్యంగా పెద్దమ్మాయి నిషికా నందమూరి తన తండ్రితో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ అలేఖ్య రెడ్డి తన పేరుకు చివర అలేఖ్య తారకరత్న అని మార్చుకోవడం ..అలాగే పిల్లలకి పేరు చివర నందమూరి అని చేర్చడం చూస్తే వాళ్లు మీరు వద్దనుకున్న నందమూరి వారసులే అని చెప్పడం అన్నట్లుగా అనిపిస్తుంది అంటూ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి: పెళ్లైన నెలకే విడిపోయే ఆలోచనలో జబర్దస్త్ సుజాతా, రాకేష్?

Next Story

Most Viewed