‘డెకాయిట్’ సినిమా విషయంలో అడివి శేష్ షాకింగ్ నిర్ణయం.. కారణం ఏంటంటే?

by Mallepaka Hamsa |

అడివి శేష్(adivi sesh), మృణాల్ ఠాకూర్(mrunal) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డెకాయిట్’(decoit).

‘డెకాయిట్’ సినిమా విషయంలో అడివి శేష్ షాకింగ్ నిర్ణయం.. కారణం ఏంటంటే?
X

దిశ, సినిమా: అడివి శేష్(adivi sesh), మృణాల్ ఠాకూర్(mrunal) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డెకాయిట్’(decoit). ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌ను షానీల్ డియో తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడక నటుడు అనురాగ్ కశ్యప్ విలన్‌గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎన్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల కానుండగా.. ఈ సమయంలో.. అడివి శేష్ మేకింగ్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ‘‘నా దృష్టిలో భాష అనేది కేవలం ఒక మాధ్యమం మాత్రమే కాదు అది ఒక భావోద్వేగం.

ఒక కథను అనువందించినప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి తప్పనిసరిగా మిస్ అవుతుంది. సినిమాలోని ఎమోషన్స్, కథ, సరిగ్గా చూపించలేం. అందుకే భారీ చిత్రాలు చేసేటప్పుడు డబ్బింగ్ రావపోవచ్చు. అందుకే నేను ‘డెకాయిట్’ను తెలుగు సినిమానే హిందీలో డబ్ చేయకుండా విడివిడిగా షూట్ చేస్తున్నాను. కొన్ని ఎమోషన్స్ చాలా బలంగా ఉండాలని.. అవి సహజంగా లేకుంటే ఆడియన్స్ కనెక్ట్ అవలేరు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను. అందుకే స్ట్రయిట్ లాంగ్వేజ్‌లోనే షూట్ చేయడం నాకు ఇష్టం’’ అని అన్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు షాక్ అవుతున్నారు. అంత ఓపికతో షూట్ చేయడం గ్రేట్ అని పొగుడుతున్నారు. అలాగే ఏ హీరో చేయని సాహసం చేస్తున్నారని అంటున్నారు.

Next Story