బావిలోకి దూకి తల్లీకూతుళ్ల అత్మహత్య

by  |
బావిలోకి దూకి తల్లీకూతుళ్ల అత్మహత్య
X

దిశ, నిజామాబాద్: బావిలోకి దూకి తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహడ్ శివారులో ఇద్దరు మహిళలు వ్యవసాయ బావిలోకి దూకి అత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం ఉదయం వెలుగు చూసింది. మృతులను ఎర్రపహాడ్ కు చెందిన బద్దం లింగమణి (42), ఆమె కూతురు బద్దం శిరీష (18) గా గుర్తించారు. వీరి మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed