షర్మిలకు మరో షాక్.. నేతల వరస రాజీ ‘నామాలు’ ?

by  |
ysrtp
X

దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ఆ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్ రాజీనామా చేసి షర్మిలకు షాకిచ్చారు. ఆ షాక్ నుంచి కోలుకోకముందే పార్టీ అధినేత్రికి మరో షాక్ తగిలింది. ఇందిరాశోభన్ కు మద్దతుగా పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. శనివారం ఇద్దరు స్టేట్ లెవల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నేతలు పార్టీని వీడుతున్నట్లు రిజైన్ లెటర్ ను అధినేత్రికి పంపించినట్లు తెలిపారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన నాయకుడు మధు వంశీ, రంగారెడ్డి జిల్లాకు చెందిన తోడేటి శ్రీకాంత్ రాజీనామా చేశారు. కాగా మరో 20 నాయకులు కూడా తమ పదవులకు రిజైన్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


Next Story