ఇంట్లోకెళ్లిన కోతులు : బంగారం, నగదు చోరీ 

by  |
ఇంట్లోకెళ్లిన కోతులు : బంగారం, నగదు చోరీ 
X

దిశ, వెబ్ డెస్క్: ఇంట్లో చొరబడిన ఓ కోతుల గ్యాంగ్ దర్జాగా బంగారం, నగలు ఎత్తుకెళ్లిపోయాయి. ఈ ఘటన తమిళనాడులోని తిరువైయారులో చోటు చేసుకుంది. భర్త చనిపోవడంతో సారతంబల్ అనే 70 ఏళ్ళ వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె ఇంటి బయట బట్టలు ఉతుక్కుంటుండగా ఇంట్లోకి ప్రవేశించాయి కోతుల గుంపు. ఇంట్లోని అరటిపండ్లు, బియ్యం సంచిని ఎత్తుకెళ్లాయి.

కాగా ఆ బియ్యం సంచిలోనే తన బంగారు ఆభరణాలు, రూ.25 వేలను దాచుకుంది పాపం ఆ వృద్ధురాలు. ఆమె కోతులను వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. ఆ డబ్బు తన వైద్య ఖర్చుల కోసం దాచుకున్నట్లు చెప్పి బోరుమంది. స్థానికులు ఆ కోతుల కోసం గాలించినా వాటి జాడ తెలియరాలేదు. ఆగ్రహించిన స్థానికులు ఆ కోతులను బంధించాలని, వాటి ఆగడాలు ఎక్కువయ్యాయని, వాటిని గ్రామంలో కనిపించకుండా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.



Next Story

Most Viewed