రైతు వేదికలు దేశానికే ఆదర్శం

by  |
రైతు వేదికలు దేశానికే ఆదర్శం
X

దిశ, భువనగిరి: రైతు వేదికలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రైతు సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం యాదాద్రి-భువనగిరిజిల్లాలో ఆయన పర్యటించారు. చీమలకొండూరు గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ₹750 కోట్లతో రైతు వేదికల నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు. భువనగిరి ఎమ్యెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కవిత, ఎంపీటీసీ సభ్యురాలు లలిత, జెడ్పీటీసీ బీరు మల్లన్న పాల్గొన్నారు.

Next Story