- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఇరు రాష్ట్రాల నేతలు మాటల యుద్ధానికి కాలుదువ్వుతున్నారు. మరోవైపు ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసులు భారీగా మోహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇరురాష్ట్రాల మధ్య జలజగడంపై ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యే రోజా స్పందించారు.
‘తెలంగాణ ప్రభుత్వాన్ని చేతులు జోడించి అడుగుతున్నాను. ఏపీకి అన్యాయం చేయొద్దు’ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. విద్యుదుత్పత్తి కోసం ఏపీకి రావాల్సిన నీటిని అక్రమంగా వినియోగించడం సరికాదన్నారు. ఏపీకి అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. జలవివాదంపై ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ పీఎం నరేంద్ర మోడీ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్లకు లేఖ రాసినట్లు ఎమ్మెల్యే రోజా తెలిపారు.