బార్ ఏర్పాటుపై ఎమ్మెల్యే మహేష్ రెడ్డి హర్షం

by Shyam |   (  Updated:2021-11-05 11:18:21  IST  )

<p>దిశ, పరిగి: హైదరాబాద్ తరహాలో అన్ని హంగులతో పరిగిలో బార్ ఏర్పాటు చేయడం చాలా బాగుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పరిగి పట్టణంలోని జాతీయ రహదారి పక్కన దుర్గాభవాని రెస్టారెంట్ అండ్ బార్‌ను శుక్రవారం ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ&#8230; పరిగి మున్సిపల్ పరిధిలో మొట్టమొదటగా బార్ రావడంతో పాటు మద్యం ప్రియులకు వీలుగా సకల సౌకర్యాలతో బార్ [&hellip;]</p>

MLA Mahesh Reddy
X

దిశ, పరిగి: హైదరాబాద్ తరహాలో అన్ని హంగులతో పరిగిలో బార్ ఏర్పాటు చేయడం చాలా బాగుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పరిగి పట్టణంలోని జాతీయ రహదారి పక్కన దుర్గాభవాని రెస్టారెంట్ అండ్ బార్‌ను శుక్రవారం ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ… పరిగి మున్సిపల్ పరిధిలో మొట్టమొదటగా బార్ రావడంతో పాటు మద్యం ప్రియులకు వీలుగా సకల సౌకర్యాలతో బార్ ఏర్పాటు చేయడంతో యాజమాన్యాన్ని అభినందించారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి తమ్మనగారి రామ్మోహన్ రెడ్డి, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, ఎంపీపీ కరణం అరవిందరావు, దోమ జెడ్పీటీసీ నాగిరెడ్డి, కమతం శ్రీనివాస్ రెడ్డి, బార్ యాజమాన్యం భర్కత్‌పల్లి రాంరెడ్డి, ఎన్నెపల్లి అనంత్ రెడ్డి, జాక సురేష్, దమ్మి కృష్ణ, సౌదపల్లి విజయ్ భాస్కర్ గౌడ్, సౌదపల్లి సందీప్ జయంత్ గౌడ్, జాక వినోద్ కుమార్, ఎన్నెపల్లి నిఖిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story