పల్లెల్లో ప్రగతి కాంతులు నింపుతాం..

by  |
పల్లెల్లో ప్రగతి కాంతులు నింపుతాం..
X

దిశ, నర్సాపూర్: దేశానికి పట్టుకొమ్మలైన పల్లె గుండెల్లో ప్రగతి కాంతులు నింపడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మధన్ రెడ్డి అన్నారు. మండలం పరిధిలోని చందాపూర్ గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన వైకుంఠధామం, డంపింగ్ యార్డులను మంగళవారం ఆయన ప్రారంభించారు. డంపింగ్ యార్డు, వైకుంఠ ధామం నిర్మాణాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన గ్రామ సర్పంచ్ సుజాత కృష్ణను, ఎంపీటీసీ రాజేందర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రామాలన్నీ అభివృద్ధి బాటలో పయనించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేస్తుండటంపై వారు హర్షం వ్యక్తం చేశారు. సాగు, తాగునీటి అవసరాల కోసం త్వరలో కాలేశ్వరం నీటితో నర్సాపూర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. అన్ని గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న డంపింగ్ యార్డు, వైకుంఠదామాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.

Next Story