హుజురాబాద్ రివ్యూకి నన్నెందుకు పిలవలేదు : జగ్గారెడ్డి

by  |
MLA Jagga Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో సమావేశం వాడివేడిగా సాగింది. ఈ నేపథ్యంలో కేసీ వేణుగోపాల్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాసిన లేఖ సంచలనం రేపుతోంది. లేఖలో హుజురాబాద్ ఓటమి రివ్యూకి నన్ను ఎందుకు పిలవలేదని పేర్కొన్నారు. నామినేషన్లు వేయడానికి ముందురోజు అభ్యర్థిని ప్రకటిస్తారా? అని ప్రశ్నించారు. హైకమాండ్ దృష్టికి ఈ విషయాలు తీసుకెళ్లలేకపోయాను, కనీసం ఈ సమావేశంలోనైనా ప్రశ్నించేవాడిని అని అన్నారు.

Next Story