కరోనా ఆషామాషీ కాదు: ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్

by  |
కరోనా ఆషామాషీ కాదు: ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్
X

దిశ, నిజామాబాద్: కరోనా మహమ్మారిని స్వీయ నియంత్రణ పాటించి సామూహికంగా ఖతం చేద్దామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ పిలుపునిచ్చారు. ఈ బృహత్కర కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని ఆయన సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్-19ని పరిశుభ్రత, వ్యక్తిగతంగా స్వీయ నియంత్రణ పాటించి తరిమికొట్టాలని చెప్పారు. ఇప్పటివరకు రూరల్ నియోజకవర్గంలో వేయిమంది విదేశాల నుంచి వచ్చారని, వారంతా స్వయం నిర్బంధంలోనే ఉన్నారన్నారు. వారందరూ తమ తమ ఇండ్లలో ఉండాలని ఎమ్మెల్యే కోరారు. ఎవరైనా మాట వినకుంటే పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. రూరల్ ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని.. సమస్యలుంటే తనను ఫోన్లో సంప్రదించాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ స్పష్టం చేశారు.

tag: mla bajireddy govardhan reddy, comments, corona Prevention, nizamabad

Next Story

Most Viewed