- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం కనపడకుండా పోయిన 8 సంవత్సరాల బాలుడు తేజ సాయిరెడ్డి బుధవారం దారుణ హత్యకు గురవడం కలకలం సృష్టించింది. అభం శుభం తెలియని చిన్నారిని దుర్మార్గులు పొట్టనపెట్టుకున్నారు. కాగా బాలుడి బంధువులే హత్య చేసినట్లు ఆరోపణలు వస్తోన్నాయి.
చిత్తూరు జిల్లాలోని కె.వి పల్లి మండలం ఎగువ మేకల వారి పల్లికి చెందిన తేజసాయిరెడ్డి తల్లిదండ్రులు నాగిరెడ్డి, జ్యోతి ఉపాధి కోసం కువైట్ దేశానికి వెళ్లారు. అప్పటి నుంచి పీలేరులో ఉన్న పెద్దమ్మ ఇంట్లో ఉంటూ తేజ సాయిరెడ్డి పాఠశాలకు వెళ్తున్నాడు. దసరా పండుగ సెలవుల కావడంతో తేజ అమ్మమ్మ అయిన పార్వతమ్మ ఇంటికి వెళ్లాడు. మంగళవారం తేజ ఇంటి బయట ఆడుకుంటుండగా గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. బంధువులంతా వెతికినా బాలుడి ఆచూకీ లభించలేదు.
బుధవారం ఉదయం కుటుంబసభ్యులు వెతుకుతుండగా గ్రామ సమీపంలోని బొప్పాయి తోటలో తేజసాయిరెడ్డి శవమై కనిపించాడు. బాలుడ్ని గొంతు నులిమి చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమీప బంధువులే తేజసాయిరెడ్డిని హతమార్చి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దసరా సెలవులను సరదాగా గడుపుదామని అమ్మమ్మ ఇంటికి వెళ్లిన తేజసాయిరెడ్డి హత్యకు గురికావడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.