టీఆర్ఎస్ ముందు బీజేపీ చాలా చిన్నది : ప్రశాంత్ రెడ్డి

by  |
టీఆర్ఎస్ ముందు బీజేపీ చాలా చిన్నది : ప్రశాంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు. రైతుల సమస్యలు, పంట కొనుగోళ్లపై ప్రభుత్వం, ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొనుగోలు కేంద్రాలు చూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. ఒకవేళ కొనుగోలు కేంద్రాలు చూపించకుంటే బండి సంజయ్, అర్వింద్ తమ పదవులకు రాజీనామాచేస్తారా? అని సవాల్ చేశారు. ఇక, సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించిన ఆయన.. టీఆర్‌ఎస్‌ పార్టీ సంఖ్యాబలం ముందు రాష్ట్ర బీజేపీ చాలా చిన్నదని.. టీఆర్ఎస్ కార్యకర్తలు తిట్టడం మొదలుపెడితే బీజేపీ నేతలు గ్రామాల్లో తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు.

Next Story