104 సీట్లతో టీఆర్ఎస్ విజయం

by  |
104 సీట్లతో టీఆర్ఎస్ విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఎల్బీనగర్ స్టేడియంలో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తలసాని పాల్గొని మాట్లాడుతూ… జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 104 సీట్లు గెలుస్తున్నదని ధీమా వ్యక్తం చేశారు. గత 60 ఏళ్లలో ఎన్నడూ లేని అభివృద్ధిని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరేండ్లలో చేసి చూపించిందని అన్నారు. హైదరాబాద్‌ను ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశామని తెలిపారు. రోడ్లు, ఫ్లైఓర్లు, అండర్‌ పాస్‌లు, పార్కులు ఇలా చాలా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. కరోనా, వరదల సమయంలోనూ ప్రజలను ఆదుకుంది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని వెల్లడించారు.

Next Story